Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ధరలు తగ్గించాలని తణుకులో ధర్నా

Follow Udayam on Google
Udayam Desk Sep 09, 2026 2:56 PM పశ్చిమగోదావరి General
ధరలు తగ్గించాలని తణుకులో ధర్నా - Udayam
నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ తణుకు ఎంఆర్‌ఓ కార్యాలయం ఎదుట సీపీఐ ఆధ్వర్యంలో బుధవారం ధర్నా నిర్వహించారు. అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఎంఆర్‌ఓ డి.అశోక్‌వర్మకు అందజేశారు. ధరల పెరుగుదలతో పేద, మధ్యతరగతి ప్రజల జీవితాలు దుర్భరంగా మారాయని సీపీఐ పట్టణ కార్యదర్శి బొద్దాని నాగరాజు, ఏరియా కార్యదర్శి పుష్పకుమారి తెలిపారు.

Comments

G
Loading comments...