వార్తలకు తిరిగి వెళ్లండి

బోనాల పండుగ సందర్భంగా వనపర్తి పట్టణంలోని పోచమ్మ ఆలయానికి మంగళవారం భక్తులు పోటెత్తారు. మహిళలు బోనం కుండలతో తరలివచ్చి క్యూలైన్లలో అమ్మవారిని దర్శించుకుని నైవేద్యం సమర్పించారు.
భక్తులు కోళ్లు, పొట్టేళ్లు బలిచ్చి, కొబ్బరికాయలు కొట్టి పిల్లాపాపలను చల్లగా చూడాలని అమ్మవారిని కోరుకున్నారు. భక్తుల రాకతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది.
Comments
Loading comments...

