వార్తలకు తిరిగి వెళ్లండి

వరుస సెలవులు, శ్రావణమాసం నేపథ్యంలో భ్రమరాంభ మల్లికార్జునస్వామి దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో శ్రీశైలం తరలివచ్చారు. దీంతో ఆదివారం నల్లమలలోని శ్రీశైలం ప్రధాన రహదారి వాహనాలతో కిటకిటలాడింది.
ఉదయం పాతాళగంగ నుంచి బ్రహ్మగిరి వరకు ట్రాఫిక్ స్తంభించింది. లింగాల గట్టు టోల్గేటు వద్ద వాహనాల కదలిక ఆలస్యమవడం, హైదరాబాద్ వైపు నుంచి భారీగా వాహనాలు రావడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
Comments
Loading comments...

