వార్తలకు తిరిగి వెళ్లండి

సంగారెడ్డి టీ-హబ్లో రక్త పరీక్షల ఫలితాలు 24 గంటల్లో ఇవ్వాల్సి ఉండగా రోజుల తరబడి ఆలస్యమవుతున్నాయి. దీంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. పర్యవేక్షణ లోపమే కారణమనే విమర్శలు వస్తున్నాయి.
రక్త పరీక్షలకు అవసరమైన రసాయనాలు గత వారం నుంచి అందుబాటులో లేవని అధికారులు తెలిపారు. సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు. జూన్ నుంచి ఈ నెల 9 వరకు 57,690 మంది నుంచి 1,08,279 నమూనాలు సేకరించారు.
Comments
Loading comments...

