వార్తలకు తిరిగి వెళ్లండి

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వ్యవసాయ విద్యుత్ సర్వీసుల జారీలో జాప్యం రైతులను ఇబ్బందులకు గురిచేస్తోంది. దరఖాస్తులు చేసి డీడీలు చెల్లించినా నెలల తరబడి సర్వీసులు మంజూరు కావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నియంత్రికలు, స్తంభాలు తదితర పరికరాల కొరతతో పనులు నిలిచిపోయాయని అధికారులు చెబుతున్నారు. దీంతో నీటి వనరులు ఉన్నా పంటలకు సాగునీరు అందక నష్టం వాటిల్లుతోందని రైతులు అంటున్నారు.
Comments
Loading comments...
