Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దేవాలయంలో ముగిసిన పవిత్రోత్సవాలు

Follow Udayam on Google
p.g.murthy Sep 03, 2026 2:39 PM మంచిర్యాలGeneral
దేవాలయంలో ముగిసిన పవిత్రోత్సవాలు - Udayam
దండేపల్లి మండలంలోని గూడెం గుట్ట శ్రీ సత్యనారాయణ స్వామి వారి దేవాలయంలో నిర్వహిస్తున్న పవిత్రోత్సవాలు గురువారం ఘనంగా ముగిశాయి. శ్రావణమాసం పురస్కరించుకొని మూడు రోజులుగా దేవాలయంలో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గురువారం దేవాలయంలో వేద పండితులు, మహా పూర్ణాహుతి, కుంభ ప్రోక్షణ, హారతి, మంత్రపుష్పం పూజలు చేశారు. పలు ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు, ప్రజలు స్వామివారిని దర్శించుకుని పూజలు చేయించారు.

Comments

G
Loading comments...