వార్తలకు తిరిగి వెళ్లండి
మేఘాద్రి రిజర్వాయర్లో ఇద్దరు విద్యార్థుల మృతి

విశాఖ జిల్లా పెందుర్తి మండలం చింతగట్ల సమీపంలోని మేఘాద్రి రిజర్వాయర్లో ఆదివారం విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఈత కోసం రిజర్వాయర్లోకి దిగిన ఇద్దరు ఇంటర్ విద్యార్థులు దీపక్ (17), రామచంద్రరావు (18) నీటిలో మునిగి మృతి చెందారు.
తమతో పాటు వచ్చిన మరో ముగ్గురు విద్యార్థుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు, గజ ఈతగాళ్ల సాయంతో మృతదేహాలను వెలికితీశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...