వార్తలకు తిరిగి వెళ్లండి

నల్లసముద్రంలో వాణిజ్య నౌకలపై దాడుల్లో భారత నావికుడు మృతి చెందడంపై విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి ఆండ్రీ సిబిహాతో ఫోన్లో మాట్లాడిన ఆయన, వాణిజ్య నౌకలపై దాడులు అత్యంత క్షమించరానివని స్పష్టం చేశారు.
ఈ దాడులను భారత్ ఖండిస్తోందని, వివాదాల పరిష్కారానికి చర్చలు, దౌత్య మార్గమే శరణ్యమని జైశంకర్ పునరుద్ఘాటించారు.
Comments
Loading comments...
