వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి జిల్లా రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసులు నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో 367 మందిపై కేసులు నమోదు చేసినట్లు ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. న్యాయస్థానం వీరికి రూ.5,17,750 జరిమానా విధించడంతో పాటు 32 మందికి 1 నుంచి 5 రోజుల జైలు శిక్ష విధించిందన్నారు.
మద్యం సేవించి వాహనం నడపడం నేరమని, వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు.
Comments
Loading comments...

