వార్తలకు తిరిగి వెళ్లండి

నూగూరు వెంకటాపురం మండల కేంద్రంలో ఆదివారం ముత్యాలమ్మ బోనాల పండుగ భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగింది. శివాపురం, జక్కులవారి వీధి, పెరిక బజారు, రాగిచెట్టు సెంటర్, నాయకులగూడెం గ్రామాల భక్తులు పాల్గొన్నారు.
మహిళలు బోనాలు ఎత్తుకుని మేళతాళాలు, డప్పు వాయిద్యాల నడుమ ఊరేగింపుగా అమ్మవారి ఆలయానికి చేరి బోనాలు సమర్పించారు. పాడిపంటలు చల్లగా ఉండాలని మొక్కులు చెల్లించారు.
Comments
Loading comments...

