వార్తలకు తిరిగి వెళ్లండి

నంద్యాల జిల్లా జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్ బుధవారం డోన్ తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యాలయంలోని వివిధ విభాగాలను పరిశీలించి రికార్డుల నిర్వహణ, పెండింగ్ దరఖాస్తులు, రెవెన్యూ సేవలపై వివరాలు తెలుసుకున్నారు.
ప్రజల అర్జీలు, రెవెన్యూ సమస్యలను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని అధికారులకు సూచించారు. రికార్డులను పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు.
Comments
Loading comments...

