వార్తలకు తిరిగి వెళ్లండి

పార్వతీపురం ఐటీడీఏ పరిధిలోని మక్కువ, కొమరాడ, పాచిపెంట మండల కేంద్రాల్లో కళాశాల విద్యార్థుల కోసం ప్రభుత్వ హాస్టళ్లు ఏర్పాటు చేయాలని ఎస్ఎఫ్ఎ నాయకులు సింహాచలం, అనిల్ డిమాండ్ చేశారు.
ఈ మేరకు గురువారం ఐటీడీఏ ఇన్ఛార్జ్ డీడీ చంద్రబాబుకు వినతిపత్రం అందజేశారు. వసతి గృహాలు లేకపోవడంతో గిరిజన, పేద విద్యార్థులు రవాణా ఖర్చులు భరించలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, తక్షణమే హాస్టళ్లు మంజూరు చేయాలని కోరారు.
Comments
Loading comments...

