Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మునగపాకలో పట్టపగలే చోరీ

Follow Udayam on Google
జయ Aug 19, 2026 10:37 AM అనకాపల్లి ఆంధ్రప్రదేశ్
మునగపాకలో పట్టపగలే చోరీ - Udayam
అనకాపల్లి జిల్లా మునగపాకలో తాళం వేసిన ఇంట్లో మంగళవారం పట్టపగలే చోరీ జరిగింది. దుండగులు తాళాలు పగులగొట్టి 10 తులాల బంగారం, 40 తులాల వెండి, రూ.50 వేల నగదు అపహరించారు. దంపతులు ఫార్మా కంపెనీకి, పిల్లలు కళాశాలకు వెళ్లిన సమయంలో దుండగులు ఇంట్లోకి చొరబడ్డారు. సాయంత్రం బాధితులు ఇంటికి చేరుకోగా చోరీ వెలుగుచూసింది. లక్ష్మి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.

Comments

G
Loading comments...