Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భద్రాద్రిలో కరెంట్‌ ఉచ్చులతో ముప్పు

Follow Udayam on Google
వివేక్ గౌడ్ Aug 12, 2026 12:11 PM భద్రాద్రి కొత్తగూడెంGeneral
భద్రాద్రిలో కరెంట్‌ ఉచ్చులతో ముప్పు - Udayam
భద్రాద్రి జిల్లాలో వన్యప్రాణుల వేటకు అమర్చుతున్న కరెంట్‌ తీగలతో మనుషులు, పశువులకు ముప్పు ఏర్పడుతోందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బూర్గంపాడు నకిరేపేటలో ఎఫ్‌బీవో నవీన్‌ మృతి చెందగా, చండ్రుగొండలో గేదెలు మృతి చెందాయి. గతంలో మణుగూరు రేంజ్‌లోనూ ఓ అధికారి విద్యుత్‌ ఉచ్చుకు మృతి చెందినట్లు సమాచారం ఉంది. కరెంట్‌ ఉచ్చులు ఏర్పాటు చేసేవారిపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

Comments

G
Loading comments...