వార్తలకు తిరిగి వెళ్లండి

వికారాబాద్ పట్టణంలోని బృంగి ఇంటర్నేషనల్ స్కూల్లో 9వ తరగతి విద్యార్థిపై పీఈటీ అధ్యాపకుడు దాడి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. విద్యార్థిని చితకబాదడంతో చర్మం కమిలిపోయేలా గాయాలయ్యాయని బంధువులు ఆరోపించారు.
పాఠశాలకు వెళ్లిన విద్యార్థి బంధువులు అధ్యాపకుడిని నిలదీశారు. పాఠశాలలో గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగాయని, అధికారుల నిర్లక్ష్యంతోనే పునరావృతమవుతున్నాయని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు
Comments
Loading comments...

