వార్తలకు తిరిగి వెళ్లండి

చోడవరం ఫిషర్మెన్ కాలనీలో బుధవారం ‘స్వచ్ఛ పదం చోడవరం’ కార్యక్రమం నిర్వహించారు. ఎంపీడీవో రాజు, ఈవో గంగాధర్, శానిటరీ ఇన్స్పెక్టర్ నారాయణరావు ఆధ్వర్యంలో రోడ్ల వెంట పిచ్చిమొక్కలు, కాలువల్లో పూడికను తొలగించారు.
తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించాలని ప్రజలకు అవగాహన కల్పించారు. రోడ్లు, కాలువల్లో చెత్త వేయకుండా ప్రతి ఒక్కరూ పరిశుభ్రత పాటించాలని సూచించారు.
Comments
Loading comments...

