వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదిలాబాద్ జిల్లా కైలాస్నగర్లో కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి నివాసంలో చోరీ జరిగింది. దుండగులు ఇంటి తాళాలు పగులగొట్టి లోనికి ప్రవేశించి నగదు, బంగారం, వెండి ఆభరణాలు అపహరించినట్లు ప్రాథమిక సమాచారం.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీం ఆధారాలు సేకరిస్తుండగా, సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
Comments
Loading comments...
