వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లాలో 212 ఏకోపాధ్యాయ పాఠశాలలు కొనసాగుతుండగా, ఉపాధ్యాయుల కొరతతో ప్రాథమిక విద్య బోధన ప్రభావితమవుతోంది. ఒకే ఉపాధ్యాయుడు అన్ని తరగతులకు బోధించాల్సి రావడంతో విద్యార్థులు చదువులో వెనుకబడుతున్నారని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయుల సర్దుబాటుపై కమిటీ కసరత్తు చేస్తోందని, నివేదిక అనంతరం కలెక్టర్ ఆమోదంతో అవసరమైన నియామకాలు చేపడతామని డీఈవో వాసంతి తెలిపారు.
Comments
Loading comments...
