వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లా కలెక్టర్ అంకిత్ సోమవారం బూర్గంపహాడ్ మండలంలో పర్యటించి గురుకుల పాఠశాల, ఎరువుల దుకాణాలను తనిఖీ చేశారు. పాఠశాలలో భోజన నాణ్యత, మెనూ అమలు, పరిశుభ్రతపై ఆయన అధికారులకు దిశానిర్దేశం చేశారు.
అనంతరం ఎరువుల దుకాణంలో స్టాక్ రిజిస్టర్లను పరిశీలించి, రైతులకు నిర్ణీత ధరలకే ఎరువులు విక్రయించాలని డీలర్లను హెచ్చరించారు. అక్రమ నిల్వలు, అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు ఉంటాయని కలెక్టర్ స్పష్టం చేశారు.
Comments
Loading comments...

