వార్తలకు తిరిగి వెళ్లండి

వర్షపు నీటిని ఒడిసిపట్టేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ సూచించారు. కోరుట్ల మండలం జోగింపల్లిలో తెలంగాణ జలసిరి పథకం కింద వ్యవసాయ భూముల్లో నీటి గుంతల తవ్వకాలను ప్రారంభించారు.
అనంతరం మహిళా సంఘ భవనం సహా పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్డీవో జీవకర్ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
Comments
Loading comments...
