Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పల్లె పల్లెకు కార్యక్రమంపై కలెక్టర్‌ సమీక్ష

Follow Udayam on Google
జయ Aug 19, 2026 4:12 PM సిద్దిపేటతెలంగాణ
పల్లె పల్లెకు కార్యక్రమంపై కలెక్టర్‌ సమీక్ష - Udayam
హుస్నాబాద్‌ నియోజకవర్గంలోని మూడు మండలాల్లో త్వరలో నిర్వహించనున్న ‘పల్లె పల్లెకు పొన్నమన్న–పల్లె పల్లెలో ప్రజాపాలన’ కార్యక్రమంపై కలెక్టర్‌ హైమావతి జూమ్‌ సమావేశం నిర్వహించారు. ఆమె అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు, కొత్త రేషన్‌ కార్డులు, గ్యాస్‌ సబ్సిడీ, ఇందిరమ్మ చీరల పంపిణీ వివరాలతో గ్రామాల వారీగా జాబితాలు సిద్ధం చేయాలని ఆమె ఆదేశించారు.

Comments

G
Loading comments...