వార్తలకు తిరిగి వెళ్లండి

పాకిస్థాన్లోని బలూచిస్థాన్ ప్రావిన్స్లో ఓ బొగ్గు గనిలో భారీ పేలుడు సంభవించి 32 మంది మైనర్లు మరణించినట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటివరకు 29 మృతదేహాలను వెలికితీసినట్లు తెలిపారు.
గనిలో మీథేన్ వాయువు పేరుకుపోవడమే పేలుడుకు కారణమై ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. పేదరికం, నిరుద్యోగం కారణంగా వేలాది మంది అక్కడ బొగ్గు గనుల్లో పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు.
Comments
Loading comments...
