Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఢిల్లీలో CNG సిలిండర్ పేలి ఇద్దరు మృతి

Follow Udayam on Google
విహార్ Aug 19, 2026 5:42 PM జాతీయంజాతీయం
ఢిల్లీలో CNG సిలిండర్ పేలి ఇద్దరు మృతి - Udayam
ఢిల్లీలోని టిక్రీ కలాన్ మెట్రో స్టేషన్ సమీపంలో ట్రక్కు CNG సిలిండర్ పేలి ఇద్దరు మృతి చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో మానిష్‌ (25) ఘటనాస్థలిలోనే మృతి చెందగా, మరో వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. పేలుడుకు కారణం ఇంకా నిర్ధారణ కాలేదు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. సమాచారం అందిన వెంటనే ఆరు ఫైర్‌ టెండర్లు అక్కడికి చేరుకున్నాయి. పరిస్థితి అదుపులో ఉందని అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...