Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పేదలకు సీఎంఆర్‌ఎఫ్‌ ఆర్థిక భరోసా

Follow Udayam on Google
జయ Aug 18, 2026 3:02 PM జోగులాంబ గద్వాల్ తెలంగాణ
పేదలకు సీఎంఆర్‌ఎఫ్‌ ఆర్థిక భరోసా - Udayam
ముఖ్యమంత్రి సహాయ నిధి పేద ప్రజలకు ఎంతో ఆర్థిక భరోసానిస్తుందని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు. మల్దకల్‌ మండలం పాల్వాయి గ్రామానికి చెందిన కె.యుగేందర్‌కు మెరుగైన వైద్యం కోసం మంజూరైన రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ పత్రాన్ని మంగళవారం అందజేశారు. గద్వాలలోని క్యాంపు కార్యాలయంలో బాధితుడికి ఎల్‌ఓసీ పత్రాన్ని ఎమ్మెల్యే అందించారు. ప్రభుత్వం పేదల ఆరోగ్యానికి ప్రాధాన్యమిస్తుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

Comments

G
Loading comments...