వార్తలకు తిరిగి వెళ్లండి

వర్షాల సమయంలో అధికారుల అలసత్వాన్ని సీఎం రేవంత్రెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు. జూన్ 9న నగరంలో ఏర్పడిన ట్రాఫిక్ ఇబ్బందులకు అధికారులే కారణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకపై నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులను సస్పెండ్ చేస్తానని ఆయన స్పష్టం చేశారు.
అధికారులు క్షేత్రస్థాయిలో ఉండి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని సీఎం ఆదేశించారు. అవసరమైతే తాను కూడా రోడ్లపైకి వస్తానని చెబుతూ, రెండేళ్ల కష్టాన్ని వృథా చేయవద్దని అధికారులను హెచ్చరించారు. బాధ్యతగా పనిచేయాలని ఆయన దిశానిర్దేశం చేశారు.
Comments
Loading comments...

