వార్తలకు తిరిగి వెళ్లండి
శ్రీవారి పుష్కరిణి మూసివేత

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు మరియు భద్రతా చర్యల్లో భాగంగా, ఆగస్టు 1 నుంచి సెప్టెంబర్ 10 వరకు 40 రోజుల పాటు తిరుమల పుష్కరిణిని మూసివేయనున్నట్లు టీటీడీ తెలిపింది.
ఈ కాలంలో పుష్కరిణిలో మరమ్మతు పనులు చేపట్టడంతో పాటు, నిత్య హారతిని కూడా నిలిపివేయనున్నారు. సెప్టెంబర్ 15 నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో భక్తులు సహకరించాలని అధికారులు కోరారు.
Comments
Loading comments...