Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చిత్తూరు సుభిక్షం కోసం ‘శ్రీనివాస కల్యాణం’

Follow Udayam on Google
dineshkumar Sep 11, 2026 6:52 PM చిత్తూరుGeneral
చిత్తూరు సుభిక్షం కోసం ‘శ్రీనివాస కల్యాణం’ - Udayam
చిత్తూరు ప్రజలు సుభిక్షంగా ఉండాలని, ఎల్‌నినో ప్రభావం తగ్గి సమృద్ధిగా వర్షాలు కురవాలని ఆకాంక్షిస్తూ శనివారం సాయంత్రం మెసానిక్ మైదానంలో శ్రీనివాస కల్యాణం, యజ్ఞం నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే గురజాల జగన్‌మోహన్ తెలిపారు. శుక్రవారం మైదానంలో జరుగుతున్న ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ప్రజలంతా పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...