వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం నందివాడ పరిధిలోని పి.పిరుమయకుంట తండా సమీపంలో చిరుత పులి దాడిలో జాదవ్ సంతోష్కు చెందిన లేగ దూడ మృతి చెందిందని స్థానికులు బుధవారం తెలిపారు.
రెండు రోజులుగా కనిపించకుండా పోయిన దూడ కోసం సంతోష్ కుటుంబ సభ్యులు అటవీ ప్రాంతంతో పాటు తండా శివారులో వెతికినా ఆచూకీ లభించలేదు. మంగళవారం మేకల కాపరులు ఇచ్చిన సమాచారంతో వెళ్లి చూడగా చిరుత పులి దాడిలో దూడ మృతి చెందినట్లు గుర్తించారు.
Comments
Loading comments...

