వార్తలకు తిరిగి వెళ్లండి

చిలకలూరిపేట బైపాస్లోని లింగాయపాలెం సమీపంలో గురువారం పెట్రోల్ ట్యాంకర్ బోల్తా పడింది. ట్యాంకర్లో ఇంధనం ఉండటంతో స్థానికులు, వాహనదారులు ఆందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని ముందస్తు చర్యలు చేపట్టారు.
ట్రాఫిక్ను మళ్లించి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. పెను ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.
Comments
Loading comments...

