వార్తలకు తిరిగి వెళ్లండి

అంగలకుదురులో రోడ్డు ప్రమాదానికి గురైన ఓ గుర్తుతెలియని వ్యక్తి కన్నుమూశాడు.గుడి వద్ద రోడ్డు దాటుతుండగా ఓ ఆటో అతన్ని బలంగా ఢీకొట్టి వెళ్లిపోయింది. స్థానికులు అతన్ని ఆస్పత్రికి తరలించారు.
హిందీ మాత్రమే మాట్లాడే ఆ వ్యక్తి (35) గుంటూరు జీజీహెచ్లో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. మృతుడి వివరాలు తెలిసిన వారు వెంటనే తెనాలి రూరల్ పోలీసులకు సమాచారం అందించాలని అధికారులు కోరారు.
Comments
Loading comments...

