వార్తలకు తిరిగి వెళ్లండి
అంబులెన్స్లా మారిన చిరాగ్ పాస్వాన్ కాన్వాయ్
అమృత్సర్ నుండి జలంధర్కు ప్రయాణిస్తుండగా కేంద్ర మంత్రి చిరాగ్ పాస్వాన్ మానవత్వాన్ని చాటుకున్నారు. మార్గమధ్యంలో డెరా సచ్ఖండ్ బల్లన్ సమీపంలో ఒక యువతి ప్రమాదవశాత్తు గాయపడి రోడ్డుపై పడి ఉండటాన్ని ఆయన గమనించారు.
వెంటనే తన కాన్వాయ్ను ఆపి, తన వాహనంలోనే ఆమెను దగ్గర్లోని ఆసుపత్రికి తరలించేలా చర్యలు తీసుకున్నారు. బాధితురాలికి ప్రాథమిక వైద్యం అందేలా చూసి, ఆమెకు భరోసా కల్పించిన అనంతరం ఆయన తన ప్రయాణాన్ని కొనసాగించారు. మంత్రి స్పందించిన తీరుపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
Comments
Loading comments...