వార్తలకు తిరిగి వెళ్లండి

మంత్రాలయం శ్రీరాఘవేంద్రస్వామి ఆరాధనోత్సవాలలో భాగంగా సోమవారం ఉత్తరారాధన వైభవంగా నిర్వహించారు. పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థుల ఆధ్వర్యంలో నిర్మల్య విసర్జన, పాదపూజ జరిగాయి.
భారీగా తరలివచ్చిన భక్తజన సందోహం నడుమ మహారథోత్సవం కన్నులపండువగా సాగింది. ఉత్సవమూర్తిని ఊరేగింపుగా తీసుకెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం వసంతోత్సవం జరిపారు.
Comments
Loading comments...

