Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రోడ్డు లేక మంచంపైనే రోగి తరలింపు

Follow Udayam on Google
Anuroop Sep 04, 2026 11:13 AM కృష్ణా జిల్లాGeneral
రోడ్డు లేక మంచంపైనే రోగి తరలింపు - Udayam
చల్లపల్లి మండలం పాగోలు గ్రామపంచాయతీ పరిధిలోని శివారు లంకతోటలో రోడ్లు అధ్వానంగా మారడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్లు బురదమయమయ్యాయి. గురువారం ఓ వ్యక్తికి జ్వరం రావడంతో 108 వాహనం గ్రామంలోకి రాలేకపోయింది. దీంతో కుటుంబ సభ్యులు అతడిని మంచంపై ఉంచి బయటకు తీసుకొచ్చారు. గ్రామానికి రోడ్డు వేయాలని ఎమ్మెల్యేను స్థానికులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...