వార్తలకు తిరిగి వెళ్లండి

స్మార్ట్ సిటీ కరీంనగర్లో రోడ్లు అద్వానంగా తయారయ్యాయని సీపీఎం నగర కార్యదర్శి గుడికందుల సత్యం విమర్శించారు. చిరుజల్లులకే రహదారులు చెరువులు, పొలాలను తలపిస్తున్నాయని మండిపడ్డారు.
డాక్టర్ స్ట్రీట్, సుభాష్ నగర్, మంచిర్యాల చౌరస్తా, గాంధీ రోడ్, టవర్ సర్కిల్, రైల్వే స్టేషన్ మార్గాల్లో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారన్నారు. స్మార్ట్ నిధులు ఏమవుతున్నాయో చెప్పాలని, అధికారులు మరమ్మతులు చేపట్టాలన్నారు.
Comments
Loading comments...

