Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బొగ్గు దిగుమతుల తగ్గింపునకు కేంద్రం కసరత్తు: కిషన్‌రెడ్డి

Follow Udayam on Google
Ravi Shukla Jun 08, 2026 3:37 PM హైదరాబాద్General
బొగ్గు దిగుమతుల తగ్గింపునకు కేంద్రం కసరత్తు: కిషన్‌రెడ్డి - Udayam
నూతన భారత నిర్మాణంలో బొగ్గు రంగం కీలకమని, ఇతర దేశాల నుంచి బొగ్గు దిగుమతులు తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నామని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. ప్రస్తుతం దేశంలో 189 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయని, ప్రధాని మోదీ ప్రతి వారం దీనిపై సమీక్షిస్తున్నారని చెప్పారు. బొగ్గు రంగంలో ఎన్డీయే ప్రభుత్వం విప్లవాత్మక సంస్కరణలు తెచ్చిందన్నారు. క్రిటికల్ మినరల్స్ మిషన్ కోసం రూ.1,500 కోట్లు కేటాయించామని, అర్జెంటీనాలో ఆరు మినరల్ బ్లాక్స్ తీసుకున్నామని ఆయన వివరించారు.

Comments

G
Loading comments...