వార్తలకు తిరిగి వెళ్లండి

కల్లూరు మున్సిపాలిటీ 5వ వార్డు ఏకలవ్యనగర్ సమీపంలోని యాదవుల స్మశాన వాటికకు సీసీ రహదారి పనులు ప్రారంభమయ్యాయి. ఎన్నో ఏళ్లుగా రహదారి లేక మృతదేహాలను తరలించేందుకు ఇబ్బందులు పడుతున్న యాదవుల సమస్యకు పరిష్కారం లభించింది.
వైస్ చైర్మన్ శీలం కోటేశ్వరి కృష్ణారెడ్డి ప్రతిపాదనతో, ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్, మంత్రి పొంగులేటి సహకారంతో నిధులు సమకూరాయి. చైర్మన్ ధరావత్ మోహన్నాయక్ పనులను ప్రారంభించారు.
Comments
Loading comments...

