వార్తలకు తిరిగి వెళ్లండి

వనపర్తి మండలం పెద్దగూడెం నుంచి తిరుమలయ్య గుట్టకు ఈనెల 22న ఎద్దుల బండ్ల ఊరేగింపు నిర్వహించనున్నట్లు సర్పంచ్ పుష్పలత శివకుమార్ తెలిపారు. శ్రావణమాసం రెండో శనివారం సందర్భంగా డప్పుచప్పుళ్లతో ఊరేగింపు సాగుతుందని తెలిపారు.
తిరుమలయ్య గుట్టకు చేరుకున్న అనంతరం గ్రామస్థులు శ్రీ తిరుమలనాథ స్వామికి దాసంగాలు సమర్పిస్తారని తెలిపారు. వేడుకలో గ్రామస్థులు అధిక సంఖ్యలో పాల్గొనాలని సర్పంచ్ కోరారు.
Comments
Loading comments...

