వార్తలకు తిరిగి వెళ్లండి

ఎన్టీఆర్ జిల్లాకు చెందిన టీడీపీ నేత సంజయ్ వర్మపై ఆయన భార్య ఫిర్యాదు మేరకు మాచవరం పోలీసులు కేసు నమోదు చేశారు.
మరో మహిళతో సంబంధం పెట్టుకుని తనను, కుమార్తెను వేధిస్తున్నారని, గ్యాస్ సిలిండర్ తెరిచి ప్రమాదానికి గురిచేయడంతో పాటు మరోసారి దాడి చేశారని ఆమె ఫిర్యాదులో ఆరోపించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు మాచవరం సీఐ చంద్రశేఖర్ తెలిపారు.
Comments
Loading comments...

