వార్తలకు తిరిగి వెళ్లండి

ఉదయగిరి మండలం గండిపాలెం వద్ద శుక్రవారం ఉదయం ఘోర ప్రమాదం తృటిలో తప్పింది. వరికుంటపాడు మండలం నుంచి వస్తున్న కారు, బీఎస్ఎన్ఎల్ టవర్ సమీపంలో అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న భారీ వృక్షాన్ని బలంగా ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో కారు ముందు భాగం తీవ్రంగా దెబ్బతిన్నప్పటికీ, అందులో ప్రయాణిస్తున్న వారు ఎటువంటి గాయాలు లేకుండా సురక్షితంగా బయటపడటంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై విచారణ చేపట్టారు.
Comments
Loading comments...

