వార్తలకు తిరిగి వెళ్లండి
పోచారంలో 40 ఏళ్ల తర్వాత బస్సు సౌకర్యం

గ్రామస్థుల వినతి మేరకు డిపో మేనేజర్ చొరవతో పోచారంతండా నుంచి పోచారం గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించారు. పెద్దకొడప్గల్ మండలం పోచారంలో శుక్రవారం జరిగిన ప్రారంభోత్సవానికి అధికారులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
నాలుగు దశాబ్దాల తర్వాత గ్రామానికి బస్సు రావడంతో గ్రామస్థుల ప్రయాణ కష్టాలు తొలిగాయి. ఈ సందర్భంగా అధికారులకు కృతజ్ఞతలు తెలుపుతూ సర్పంచి, గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.
Comments
Loading comments...