వార్తలకు తిరిగి వెళ్లండి

సూర్యాపేట మీదుగా బుల్లెట్ ట్రైన్ కారిడార్ సాధన కోసం ఈ నెల 13 నుంచి దశలవారీ ఆందోళనలు చేపడతామని సాధన సమితి కన్వీనర్ ఆరుట్ల జానకిరెడ్డి తెలిపారు. అలైన్మెంట్ మార్పుతో సూర్యాపేట ప్రజల దశాబ్దాల కల దెబ్బతినేలా చేస్తే ఊరుకోబోమని అన్నారు.
ఈ పోరాటంలో అన్ని వర్గాలు, ఉపాధ్యాయులు, ప్రజలు ఐక్యంగా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. సూర్యాపేటలో జరిగిన సదస్సులో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
Comments
Loading comments...

