Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బస్సు ప్రమాదంలో 25 మందికి గాయాలు

Follow Udayam Digital on Google
రాజిత దేవి Aug 10, 2026 7:32 AM అనంతపురంఆంధ్రప్రదేశ్
బస్సు ప్రమాదంలో 25 మందికి గాయాలు - Udayam Digital
అనంతపురం జిల్లా పామిడి మండలం పొగరూరు వద్ద ఐషర్‌ వాహనాన్ని ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు ఢీకొట్టడంతో 25 మంది గాయపడ్డారు. రెండు వాహనాలు బ్రిడ్జిపై నుంచి కిందకు దూసుకెళ్లి బోల్తాపడ్డాయి. బస్సు డ్రైవర్‌ కాలు విరగగా, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో బెంగళూరుకు తరలించారు. ఐషర్‌ డ్రైవర్‌ సురక్షితంగా బయటపడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...