వార్తలకు తిరిగి వెళ్లండి

పెళ్లి చేసుకుంటానని చెప్పి ఓ వ్యక్తి రూ.40 లక్షలు తీసుకుని మోసం చేశాడని ఆరోపిస్తూ హైదరాబాద్కు చెందిన యువతి కురబలకోట అంగళ్లు పోలీస్ ఔట్పోస్ట్లో ఆత్మహత్యకు యత్నించింది. స్థానికులు ఆమెను మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
తనకు న్యాయం చేయాలని ఆమె కోరింది. గతంలో పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆరోపించింది. ఘటనపై పోలీసులు విచారణ చేస్తున్నారు.
Comments
Loading comments...

