Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బ్రిడ్జి వద్ద పొంచి ఉన్న ప్రమాదం

Follow Udayam on Google
p.g.murthy Sep 05, 2026 5:09 PM మంచిర్యాలGeneral
జన్నారం మండలంలోని ఇందన్పల్లి శివారులో ఉన్న హనుమాన్ దేవాలయం సమీపంలో ఉన్న రోడ్డుపై గుంతలు ప్రమాదకరంగా మారాయి. దీంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. హనుమాన్ దేవాలయం నుండి ఎక్స్ రోడ్ మధ్యలో ఉన్న వంతెన సమీపంలోని రోడ్డుపై గుంతలు ఏర్పడడంతో తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. వాహనదారులు దగ్గరకు వస్తే తప్ప గుంతలు గుర్తించని పరిస్థితి ఏర్పడింది. ఒక్కోసారి సడన్ గా బ్రేకులు వేస్తే ప్రమాదాలు జరుగుతున్నాయి.

Comments

G
Loading comments...