Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బరగఢ్‌లో ఇరువర్గాల ఘర్షణ.. 8 మందికి తీవ్ర గాయాలు

Follow Udayam on Google
SHRUTHI Sep 19, 2026 1:15 PM జాతీయంGeneral
బరగఢ్‌లో ఇరువర్గాల ఘర్షణ.. 8 మందికి తీవ్ర గాయాలు - Udayam
ఒడిశా రాష్ట్రం బరగఢ్ టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని పాతికార్‌పల్లిలో శుక్రవారం అర్ధరాత్రి రెండు వర్గాల మధ్య చెలరేగిన ఘర్షణలో కత్తులతో పరస్పరం దాడి చేసుకోవడంతో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించగా, వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స అందిస్తున్నారు.

Comments

G
Loading comments...