వార్తలకు తిరిగి వెళ్లండి

ఖమ్మం జిల్లా ఖాణాపురంలో రేణుక అనే మహిళ అనుమానాస్పద స్థితిలో కారులో మృతిచెందారు. భర్త విద్యా సాగర్ కారులో వెళ్తుండగా ఇద్దరి మధ్య ఘర్షణ జరిగినట్లు పోలీసులు తెలిపారు.
అనంతరం రేణుక మృతిచెందడంతో విద్యా సాగర్ కారును అక్కడే వదిలి పరారయ్యాడు. భర్తే అనుమానంతో హత్య చేశాడని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న విద్యాసాగర్ కోసం గాలిస్తున్నారు.
Comments
Loading comments...

