వార్తలకు తిరిగి వెళ్లండి
విశాఖపట్నం షీలానగర్ మారుతి జంక్షన్ వద్ద బ్రేక్ ఇన్స్పెక్టర్ లారీ డ్రైవర్పై దాడి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. రవాణా శాఖ తనిఖీల సమయంలో లారీ ఆపకుండా వెళ్లిపోవడంతో బ్రేక్ ఇన్స్పెక్టర్ లారీని ఓవర్టేక్ చేసి దాడి చేసినట్లు సమాచారం.
ఈ దాడిలో లారీ డ్రైవర్కు రక్తస్రావమైనట్లు సమాచారం. ఘటనకు నిరసనగా ఏపీ లారీ అసోసియేషన్ సభ్యులు ధర్నాకు సిద్ధమయ్యారు.
Comments
Loading comments...

