Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యూరియా బుకింగ్ నేడే

Follow Udayam on Google
Harika Aug 31, 2026 11:52 AM ఖమ్మంGeneral
యూరియా బుకింగ్ నేడే - Udayam
వేంసూరు మండలంలో యూరియా అవసరమైన రైతులు సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు యాప్‌లో బుకింగ్‌ చేసుకోవాలని ఏవో పచ్చల రామ్మోహన్‌రావు సూచించారు. లచ్చన్నగూడెం, భరణిపాడు, దుద్దేపూడి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, మర్లపాడు గ్రోమోర్‌ సెంటర్‌లో యూరియా అందుబాటులో ఉంది. బుకింగ్‌ సమయంలో సాంకేతిక సమస్యలు ఎదురైతే వెంటనే వ్యవసాయశాఖ అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు.

Comments

G
Loading comments...