వార్తలకు తిరిగి వెళ్లండి

తమిళనాడు ఎక్స్ప్రెస్ రైల్లోని సూట్కేస్లో మహిళ శరీర భాగాలు లభించిన కేసులో నిందిత దంపతులను పోలీసులు మణిపుర్లో అరెస్టు చేశారు. మృతురాలిని హైతుల్లా నిషా(38)గా గుర్తించారు.
చెన్నై గూడువాంజేరిలో ఆమెను హత్య చేసి, కొన్ని శరీర భాగాలను సూట్కేస్లో ఉంచి రైల్లో వదిలినట్లు దర్యాప్తులో తేలిందని పోలీసులు తెలిపారు. నిందితులను ట్రాన్సిట్ వారెంట్పై తాంబరం తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టారు.
Comments
Loading comments...

