వార్తలకు తిరిగి వెళ్లండి

సూడాన్లోని పశ్చిమ కొర్దోపాన్ ప్రావిన్సులో బంగారు గని కుప్పకూలి 67 మంది మృతిచెందారు. నుహుద్ పట్టణంలోని అల్-జారా గనిలో మంగళవారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. పలువురి ఆచూకీ ఇంకా లభించలేదు.
శిథిలాల కింద మరికొందరు చిక్కుకుని ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. స్థానికులు సాధారణ పారలు, గునపాలతో శిథిలాలను తొలగిస్తూ సహాయక చర్యలు చేపడుతున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
Comments
Loading comments...

